కువైట్ లో ఫిబ్రవరి 20 నుంచి PCR టెస్ట్ నిబంధన ఎత్తివేత
- February 15, 2022
కువైట్: కువైట్ వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఫిబ్రవరి 20 నుండి PCR టెస్ట్ రిపోర్ట్, క్వారంటైన్ నిబంధనలను ఎత్తివేయనున్నారు. పూర్తి వ్యాక్సిన్ డోసులు(రెండు) తీసుకున్న సిటిజన్స్, రెసిడెంట్స్, టూరిస్టులు ఇకపై దేశంలోకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత PCR పరీక్షను చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే హోమ్ క్వారంటైన్(7 రోజులు) ఉండాల్సిన పని లేదని ప్రభుత్వ ప్రతినిధి M. తారిక్ అల్-ముజారమ్ వెల్లడించారు. ఫిబ్రవరి 20 (ఆదివారం) ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులు ప్రయాణానికి ముందు 72 గంటల ముందు తప్పనిసరిగా PCR పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని తారిక్ అల్-ముజారమ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







