అస్సాంలో తెలంగాణ సీఎం కేసీఆర్పై కేసు నమోదు..!
- February 15, 2022
హైదరాబాద్: సర్జికల్ స్ట్రయిక్స్పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై అస్సాం బీజేపీ నేతలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల నిర్వహించిన ప్రెస్మీట్లో సర్జికల్ స్ట్రయిక్స్కు ప్రూఫ్ కావాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై అస్సాంలో బీజేపీ నేతలు కేసీఆర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ పట్ల అస్సాం సీఎం వ్యాఖ్యలను కేసీఆర్ తప్పుపట్టారు. అస్సా సీఎంను బీజేపీ ప్రోత్సహిస్తుందా అంటూ ప్రశ్నించారు. ఆయనపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్పై ఆధారాలు బయటపెట్టాలని కేంద్రాన్ని రాహుల్ అడగడంలో తప్పు లేదన్న కేసీఆర్...తాను కూడా ఆధారాలు అడుగుతున్నానన్నారు.
తాజా వార్తలు
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!







