భర్త నుంచి నిరాదరణకు గురైన భార్యకు విడాకులు మంజూరు

- February 17, 2022 , by Maagulf
భర్త నుంచి నిరాదరణకు గురైన భార్యకు విడాకులు మంజూరు

మనామా: హై షరియత్ కోర్టు, ఓ మహిళకు విడాకులు మంజూరు చేసింది. పదేళ్ళ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భర్త తనను వేధింపులకు గురిచేస్తున్నారనీ, ఆర్థికంగా తనను ఇబ్బందులు పెడుతున్నారనీ బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ కేసులో బాధితురాలి వాదన నిజమేనని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com