షార్జా సఫారీ పార్క్ ను ప్రారంభించిన షేక్ సుల్తాన్
- February 18, 2022
యూఏఈ: ప్రపంచంలోనే ఆఫ్రికా తర్వాత అతిపెద్ద సఫారీ అయిన షార్జా సఫారీ పార్క్ ను సుప్రీమ్ కౌన్సిల్ మెంబర్, షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షేక్ సుల్తాన్తో పాటు షార్జా డిప్యూటీ రూలర్లు షేక్ అబ్దుల్లా బిన్ సలేం బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి, షేక్ సుల్తాన్ బిన్ అహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి లతోపాటు ఇతర ప్రముఖులు ఉన్నారు. షేక్ సుల్తాన్, షేక్లు షార్జా సఫారీ పార్క్ లో పర్యటించారు. మొత్తం 12 ప్రధాన థీమ్ పార్కులను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి థీమ్ పార్క్ ఆఫ్రికాలోని ఒక ప్రాంతానికి సూచికగా ఏర్పాటు చేశారు. ఇందులో ఆయా ప్రాంతాల్లో నివసించే జంతువులు, పక్షులను ఏర్పాటు చేశారు. అల్ దైద్ నగరంలోని అల్ బ్రిడి నేచర్ రిజర్వ్ 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. షార్జా సఫారి ఆఫ్రికాలో పర్యటించిన అనుభూతిని అందిస్తోంది. ఆఫ్రికాలో నివసించే 120 కంటే ఎక్కువ జాతుల చెందిన దాదాపు 50,000 కంటే ఎక్కువ జంతువులు, 100,000 ఆఫ్రికన్ చెట్లను సఫారీలో ఏర్పాటు చేశారు. టిక్కెట్లను మూడు వేర్వేరు కేటగిరీలు(గోల్డ్, సిల్వర్, బ్రాంజ్)గా విభజించారు. ఎంట్రీ ధరలు కూడా 15 Dhs (సాధరణ)- 3,500 Dhs(లగ్జరీ) వరకు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







