ఆంక్షల సడలింపుతో పెరిగిన విమాన ప్రయాణాలు

- February 19, 2022 , by Maagulf
ఆంక్షల సడలింపుతో పెరిగిన విమాన ప్రయాణాలు

గల్ఫ్: కరోనా వ్యాప్తి తగ్గడంతో పలు దేశాలు ప్రయాణ ఆంక్షలను సడలించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు పెరిగాయి. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (లటా) ప్రకటించింది. ఇటీవలి కాలంలో విక్రయించిన అంతర్జాతీయ టిక్కెట్లు.. 2019 అమ్మకాలతో పోల్చితే 11 శాతం పెరుగుదల నమోదయిందని పేర్కొంది. కోవిడ్-19 సరిహద్దు ఆంక్షల సడలింపును మరిన్ని ప్రభుత్వాలు ప్రకటించడంతో టిక్కెట్ల విక్రయాలు పెరిగాయని వెల్లడించింది. ప్రపంచంలోని టాప్ 50 ఎయిర్ ట్రావెల్ ఏజెన్సీ డేటా అధారంగా ఈ సర్వే చేసినట్టు లటా తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com