గురుదర్బార్ సింధీ ఆలయంలో భక్తుల సందడి
- February 21, 2022
దుబాయ్: కోవిడ్ పరిమితులను సడలించడంతో బుర్ దుబాయ్లోని గురుదర్బార్ సింధీ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని, ఆలయానికి భక్తుల రాక మొదలైందని ఆలయ జనరల్ మేనేజర్ గోపాల్ కూకాని చెప్పారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ నిబంధనల ప్రకారం.. ఆలయం ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 6 నుండి మధ్యాహ్నం వరకు.. సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతున్నామన్నారు. భౌతిక దూర నిబంధనలపై సడలింపులు ఉన్నప్పటికీ, రద్దీని నివారించడానికి భక్తుల మధ్య 1.5 మీటర్ల దూర నిబంధనను కొనసాగిస్తున్నామని చెప్పారు. కోవిడ్ భద్రతా నియమాల ప్రకారం.. ఎంట్రీ/ఎగ్జిట్ గేట్ల వద్ద థర్మల్ కెమెరాలు, హ్యాండ్ శానిటైజర్లు పెట్టినట్టు తెలిపారు. జనవరి 22 నుండి దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ నిబంధనలను సడలించిన విషయం తెలిసిందే.


తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







