గురుదర్బార్ సింధీ ఆలయంలో భక్తుల సందడి
- February 21, 2022
దుబాయ్: కోవిడ్ పరిమితులను సడలించడంతో బుర్ దుబాయ్లోని గురుదర్బార్ సింధీ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని, ఆలయానికి భక్తుల రాక మొదలైందని ఆలయ జనరల్ మేనేజర్ గోపాల్ కూకాని చెప్పారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ నిబంధనల ప్రకారం.. ఆలయం ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 6 నుండి మధ్యాహ్నం వరకు.. సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతున్నామన్నారు. భౌతిక దూర నిబంధనలపై సడలింపులు ఉన్నప్పటికీ, రద్దీని నివారించడానికి భక్తుల మధ్య 1.5 మీటర్ల దూర నిబంధనను కొనసాగిస్తున్నామని చెప్పారు. కోవిడ్ భద్రతా నియమాల ప్రకారం.. ఎంట్రీ/ఎగ్జిట్ గేట్ల వద్ద థర్మల్ కెమెరాలు, హ్యాండ్ శానిటైజర్లు పెట్టినట్టు తెలిపారు. జనవరి 22 నుండి దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ నిబంధనలను సడలించిన విషయం తెలిసిందే.


తాజా వార్తలు
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!
- యూఏఈలో భారీగా డ్రగ్స్ సీజ్..13మంది అరెస్టు..!!
- ప్రోగ్రామింగ్ లోపం..సౌదీలో హ్యుందాయ్ వెహికిల్స్ రీకాల్..!!
- మే 7వరకు ఒమన్ లో సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు..!!
- కువైట్లో ట్రాఫిక్ మార్పులు: ఐదవ రింగ్ రోడ్డుపై 14 రోజుల పాటు లేన్లు మూసివేత
- NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు రెండు సంవత్సరాల రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు
- మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!









