యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు..
- February 26, 2022
యుక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు మొదలైంది. కీవ్ నుంచి రొమేనియా చేరుకున్న విద్యార్థులు ఇవాళ భారత్ చేరుకోనున్నారు. రెండు ప్రత్యేక ఎయిరిండియా విమానాల్లో 470 మంది స్వదేశానికి రానున్నారు. రొమేనియా నుంచి రెండు ఎయిర్ ఇండియా విమానాలు భారత్ బయలుదేరాయి. ఇప్పటికే రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఢిల్లీ, ముంబైలకు విమానాలు బయల్దేరాయి. ఉదయం 10.30 గంటలకు ఎఐ 1942 విమానం ఢిల్లీ చేరుకోనుంది. మరో ఎఐ 1944 విమానం మధ్యాహ్నం ముంబైకు చేరుకోనుంది.
ముందుగా భారతీయులను యుక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా, హంగరీ ప్రాంతాలకు తరలించారు. వాళ్లంతా రొమేనియా రాజధాని బుకారెస్ట్కు చేరుకున్నాక ఎయిరిండియా విమానాల్లో భారత్కు బయల్దేరారు. తరలింపు ఖర్చును పూర్తిగా భరించనున్నట్లు కేంద్రం తెలిపింది. యుక్రెయిన్ నుంచి వస్తున్న వారిలో 22 మంది ఏపీ విద్యార్థులు ఉన్నారు. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి రానున్న 13 మంది, ముంబైకి రానున్న 9 మంది విద్యార్థులు రానున్నారు.
ఎంబీబీఎస్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి రొమేనియా సరిహద్దులకు చేరుకొని స్వదేశానికి చేరుకుంటున్నారు. హంగేరి రాజధాని బుడాపెస్ట్ నుంచి భారతీయులతో మరో ఎయిర్ ఇండియా విమానం బయలుదేరనున్నారు. పలువురు తెలుగు విద్యార్థులు ఈ సాయంత్రానికి ఢిల్లీ, ముంబయి చేరుకోనున్నారు. యుక్రెయిన్లో ఉన్న ఏపీ విద్యార్థుల తరలింపుపై సమీక్ష జరిపిన సీఎం జగన్.. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..









