లండన్ ప్రైమ్ మినిస్టర్ ను కడిగిపారేసిన మహిళా జర్నలిస్ట్
- March 02, 2022
పోలెండ్లో పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు యుక్రెయిన్ మహిళా జర్నలిస్ట్ షాక్ ఇచ్చింది.
ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓ రేంజ్లో కడిగి పారేసింది. ఆ మహిళా జర్నలిస్టు దెబ్బకు జాన్సన్ నోరు వెళ్లబెట్టి చూడటం మినహా ఏమీ చేయలేకపోయారు. అసలు మమ్మల్ని నట్టేట ముంచింది మీరు కాదా అని నిలదీసింది యుక్రెయిన్ జర్నలిస్టు. యుక్రెనియన్ పిల్లలపై బాంబుల వర్షం కురుస్తుందన్నారు. కానీ మీరు మరిన్ని ఆంక్షల గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మరి రష్యా బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్పై ఆంక్షలేవన్నారు..? అతను లండన్లోనే ఉన్నాడని.. అతని పిల్లలు యుద్ధభూమిలో లేరన్నారు. పుతిన్ పిల్లలు నెదర్లాండ్, జర్మనీలో ఉన్నారన్నారు. విలాసవంతమైన భవనాల్లో జీవితాలు గడుపుతున్నారన్నారు. మీరు వాటిని ఎక్కడ సీజ్ చేశారని నిలదీశారు.

యుక్రెయిన్ను నో ఫ్లైజోన్గా ప్రకటిస్తే ఏంటి సమస్య అని జర్నలిస్ట్ నిలదీయడంతో బోరిస్ జాన్సన్ నీళ్లు నమిలారు. అసలు ఏం జరుగుతుందో మీకు తెలియడం లేదని… ఓసారి దేశంలోకి వచ్చి చూస్తే పరిస్థితి మీకు అర్థమవుతుందని చెప్పింది. పోలెండ్కు వచ్చిన మీరు కీవ్కు ఎందుకు రాలేదంటూ జాన్సన్ను ఆమె నిలదీసింది. మరిన్ని ఆంక్షలు అంటున్న మీరు అసలు ఇప్పటిదాకా అమలు చేస్తున్న ఆంక్షలు ఏమైనా ఫలితాన్నిచ్చాయా అని ప్రశ్నించారు. రష్యా బిలియనీర్లు యూరోప్లోనే దర్జాగా గడుపుతున్నారని చెప్పారు. ఆమె మాట్లాడుతున్నంత సేపు బోరిస్ జాన్సన్ అలా చూస్తుండిపోయారు.
Incredibly powerful moment at Boris Johnson’s press conference in Poland pic.twitter.com/QHgWfjjrHv
— Sebastian Payne (@SebastianEPayne) March 1, 2022
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







