చెన్నై మేయర్గా 28 ఏళ్ల ప్రియ రికార్డు
- March 04, 2022
చెన్నై: చెన్నై నగరపాలక సంస్థ మేయర్గా తొలిసారి ఓ దళిత మహిళ ఎన్నికయ్యారు. నగర మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డీఎంకేకి చెందిన 28 ఏళ్ల ఆర్ ప్రియ మేయర్గా శుక్రవారం (మార్చి 4,2022) ఉదయం 9.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ప్రమాణ స్వీకారంతో మేయర్ అయిన తొలి దళిత మహిళగా..అతి పిన్నయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కారు.
అలాగే చెన్నై మేయర్ అయిన మూడో మహిళగా కూడా నిలిచారు ప్రియ. గతంలో తారా చెరియన్ , కామాక్షి జయరామన్ చైన్నై మేయర్లుగా పనిచేయగా మూడో మహిళగా అందులోను దళిత మహిళగా ప్రియ రికార్డు సృష్టించారు. నగరంలోని దక్షిణ ప్రాంతాలకు చెందిన డీఎంకే కౌన్సిలర్ ఎం.మకేష్ కుమార్ మధ్యాహ్నం 2.30 గంటలకు డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
2021జనవరిలో జరిగిన చెన్నై కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలుపొందిన యువ అభ్యర్థులలో ప్రియ కూడా ఒకరు. వారిలో డీఎంకే మిత్రపక్షమైన సీపీఎంకి చెందిన 21 ఏళ్ల ప్రియదర్శిని అతి చిన్న వయస్సుగల యువతిగా రికార్డు సృష్టించారు. తీనాంపేట 98వ వార్డు నుంచి ప్రియదర్శిని గెలుపొందారు. 74వ వార్డు అయిన తిరు వీ కా నగర్ నుంచి గెలుపొందిన ప్రియా.. ఉత్తర చెన్నై నుంచి ఎంపికైన మొదటి మేయర్గా కూడా రికార్డ్ సృష్టించారు.
26 చ.కి.మీలో 61 లక్షల కంటే ఎక్కువ మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ)లో 200 వార్డులు ఉండగా.. డీఎంకే 153 స్థానాల్లో విజయం సాధించింది. అన్నాడీఎంకే 15, కాంగ్రెస్ 13, ఇండిపెండెట్లు 5, సీపీఎం 4, వీసీకే 4, బీజేపీ 1 స్థానం చొప్పున గెలుపొందాయి.
మేయర్ గా ప్రమాణస్వీకారం చేసిన ప్రియా మీడియాతో మాట్లాడుతూ..‘‘సీఎం ఎంకే స్టాలిన్ తనకు ఆదర్శమని అన్నారు. మా నాయకుడు దళిత మహిళను ఎంపిక చేసి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారు. రోడ్ల అభివృద్ధికే నా ప్రాధాన్యత. చాలా ప్రాంతాల్లో రోడ్లు అస్సలు బాగాలేదు. ముఖ్యంగా వర్షం వస్తే..వరలుగా మారే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిని మారుస్తామని ధీమా వ్యక్తంచేశారు.నగర పరిశుభ్రతపై కూడా దృష్టి సారిస్తామని అన్నారు. మహిళలకు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటాం అని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







