పాకిస్తాన్ మసీద్ లో బాంబు పేలుడు.. 30 మంది మృతి
- March 04, 2022
పాకిస్తాన్: పాకిస్తాన్ పెషావర్ లోని ఓ మసీద్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు.వాయువ్య పాకిస్థాన్లోని పెషావర్ నగరంలో కోచా రిసల్దార్ ప్రాంతంలో జరిగిన పేలుడులో కనీసం 30 మంది మరణించారని.. వంద మందికి పైగా గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు.పెషావర్లో శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఈ పేలుడు సంభవించింది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.. మేం అత్యవసర స్థితిలో ఉన్నాము మరియు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నామని.. మరోవైపు, పేలుడు యొక్క స్వభావాన్ని పరిశీలిస్తున్నామని.. అయితే ఇది ఆత్మాహుతి దాడిగా అనిపిస్తోందని పోలీసు అధికారి మహ్మద్ సజ్జాద్ ఖాన్ వెల్లడించారు.. పేలుడు సంభవించిన మసీదు.. పరిసర ప్రాంతాల్లో అనేక మార్కెట్లు ఉన్నాయని.. సాధారణంగా శుక్రవారం ప్రార్థనల సమయంలో రద్దీగా కూడా ఉండడంతో.. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, పేలుడుకు ముందు కాల్పుల శబ్దం కూడా వినిపించినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.మసీదులో జరిగిన ఆత్మహుతి దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించారు. అధికారుల నుంచి పేలుడుకు సంబంధించిన నివేదికను కోరారు. నిజానికి ఇవాళ రావల్పిండిలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది. ఆ మ్యాచ్ ను వీక్షించేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రావల్పిండి రావాల్సి వుంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







