స్మాట్రాన్ తన తొలి స్మార్ట్ఫోన్ 'టి.ఫోన్' మార్కెట్లో ఆవిష్కరించింది..
- March 31, 2016
దేశీ టెక్నాలజీ కంపెనీ స్మాట్రాన్ తన తొలి స్మార్ట్ఫోన్ 'టి.ఫోన్', అల్ట్రాబుక్ 'టి.బుక్'లను గురువారం మార్కెట్లో ఆవిష్కరించింది. 'టి.ఫోన్' స్మార్ట్ఫోన్ 5.5 అంగుళాల తెరతో చాలా తేలికగా ఉంటుందని స్మాట్రాన్ పేర్కొంది. ఫోన్కు సంబంధించిన ఏ ఇతర ప్రత్యేకతలను కంపెనీ వెల్లడించలేదు. ఇవి ఏప్రిల్ చివరి వారంలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇక 'టి.బుక్'లో 12.2 అంగుళాల తెర, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 37 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని స్మాట్రాన్ తెలిపింది. దీని ధర రూ.39,999. ఇవి వినియోగదారులకు ఏప్రిల్ 8 నుంచి 'గ్యాడ్జెట్స్360.కామ్'లో అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







