143 మంది ప్రభుత్వ సిబ్బంది అరెస్టు
- March 05, 2022
రియాద్: లంచం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ ఆరోపణలపై మొత్తం 143 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను సౌదీ అరేబియా పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) అరెస్టు చేసింది. గత నెలలో వివిధ ప్రభుత్వ శాఖల్లో నజాహా చేపట్టిన 5072 తనీఖీల్లో 544 మంది అనుమానితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసి వారిలో 143 మందిని అరెస్టు చేసినట్లు నజాహా శుక్రవారం తెలిపింది. అరెస్టైన వారిలో రక్షణ, హోం, హెల్త్, న్యాయం, ఎడ్యుకేషన్, మున్సిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహ మంత్రిత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ప్రజా ధనాన్ని రక్షించడానికి, పరిపాలనా అవినీతికి చెక్ పెట్టేందుకు అవినీతి అధికారుల సమాచారం అందించాలని ప్రజలను నజాహా కోరింది.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







