143 మంది ప్రభుత్వ సిబ్బంది అరెస్టు
- March 05, 2022
రియాద్: లంచం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ ఆరోపణలపై మొత్తం 143 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను సౌదీ అరేబియా పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) అరెస్టు చేసింది. గత నెలలో వివిధ ప్రభుత్వ శాఖల్లో నజాహా చేపట్టిన 5072 తనీఖీల్లో 544 మంది అనుమానితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసి వారిలో 143 మందిని అరెస్టు చేసినట్లు నజాహా శుక్రవారం తెలిపింది. అరెస్టైన వారిలో రక్షణ, హోం, హెల్త్, న్యాయం, ఎడ్యుకేషన్, మున్సిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహ మంత్రిత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ప్రజా ధనాన్ని రక్షించడానికి, పరిపాలనా అవినీతికి చెక్ పెట్టేందుకు అవినీతి అధికారుల సమాచారం అందించాలని ప్రజలను నజాహా కోరింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







