143 మంది ప్రభుత్వ సిబ్బంది అరెస్టు
- March 05, 2022
రియాద్: లంచం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ ఆరోపణలపై మొత్తం 143 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను సౌదీ అరేబియా పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) అరెస్టు చేసింది. గత నెలలో వివిధ ప్రభుత్వ శాఖల్లో నజాహా చేపట్టిన 5072 తనీఖీల్లో 544 మంది అనుమానితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసి వారిలో 143 మందిని అరెస్టు చేసినట్లు నజాహా శుక్రవారం తెలిపింది. అరెస్టైన వారిలో రక్షణ, హోం, హెల్త్, న్యాయం, ఎడ్యుకేషన్, మున్సిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహ మంత్రిత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ప్రజా ధనాన్ని రక్షించడానికి, పరిపాలనా అవినీతికి చెక్ పెట్టేందుకు అవినీతి అధికారుల సమాచారం అందించాలని ప్రజలను నజాహా కోరింది.
తాజా వార్తలు
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!









