భారత్ కరోనా అప్డేట్
- March 05, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, మరణాలు భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 5,921 కొవిడ్ కేసులు బయటపడగా.. 11,651 మంది కోలుకున్నారు. 289 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 63,878గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.దేశంలో మొత్తం కేసులు 4,29,45,284గా వున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా మొత్తం మరణాలు 5 లక్షల14 వేల 878గా వున్నాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 63,878 వున్నాయని కేంద్రం తెలిపింది. కరోనా నుంచి కోలుకున్నవారు 4,23,78,721గా వున్నారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శర వేగంగా జరుగుతోంది. శుక్రవారం మరో 24,62,562 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 178 కోట్ల 55 లక్షల 66,940కు చేరింది.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో రోజుకి 3 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. గత 15 రోజులుగా కేసుల్లో భారీగా తగ్గుదల నమోదవుతోంది. గత వారం రోజుల్లో రోజుకి 10 వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగడంతో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కరోనా నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









