భారత్ కరోనా అప్డేట్
- March 05, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, మరణాలు భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 5,921 కొవిడ్ కేసులు బయటపడగా.. 11,651 మంది కోలుకున్నారు. 289 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 63,878గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.దేశంలో మొత్తం కేసులు 4,29,45,284గా వున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా మొత్తం మరణాలు 5 లక్షల14 వేల 878గా వున్నాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 63,878 వున్నాయని కేంద్రం తెలిపింది. కరోనా నుంచి కోలుకున్నవారు 4,23,78,721గా వున్నారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శర వేగంగా జరుగుతోంది. శుక్రవారం మరో 24,62,562 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 178 కోట్ల 55 లక్షల 66,940కు చేరింది.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో రోజుకి 3 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. గత 15 రోజులుగా కేసుల్లో భారీగా తగ్గుదల నమోదవుతోంది. గత వారం రోజుల్లో రోజుకి 10 వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగడంతో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కరోనా నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్గా ఏపీ కేడర్ ఐఏఎస్కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!







