హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి..
- March 08, 2022
హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రముఖ సంస్థలైన చాలా కంపెనీలు తమ యూనిట్లను తెలంగాణలో ఏర్పాటు చేశాయి. తాజాగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో తన డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందం పై హర్షం వ్యక్తం చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రకారం హైదరాబాద్లో ఏర్పాటు కానున్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఆ సంస్థకు సంబంధించి అతిపెద్ద డేటా సెంటర్గా నిలవనుంది. ఈ డేటా సెంటర్ కోసం మైక్రోసాఫ్ట్ ఏకంగా రూ.15 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.
ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు డేటా సెంటర్ను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. భారత దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్కు మైక్రోసాఫ్ట్ రూ.15వేల కోట్లు ఇన్వెస్ట్ చేయడం హర్షనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రానున్న అతిపెద్ద ఎఫ్డీఐ అవుతుందని ఆయన అన్నారు. మైక్రోసాఫ్ట్, తెలంగాణకు సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. హైదరాబాద్లో అత్యంత పెద్ద డేటా సెంటర్ను ఆ కంపెనీ ఏర్పాటు చేయనుండటం సంతోషకరమని, తెలంగాణ-మైక్రోసాఫ్ట్ మధ్య రిలేషన్ పెరగడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. జనాభా పెరుగుతున్న కారణంగా టెక్నాలజీ పరంగా మరింతగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్లో తన నాలుగో డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. ఈ డేటా సెంటర్ గురించి గత ఏడాదే తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది మైక్రోసాఫ్ట్.
హైదరాబాద్ లో ఏర్పాటు చేసే డేటా సెంటర్ ద్వారా.. ప్రస్తుతం పుణె, ముంబై, చెన్నై నగరాల్లో ఉన్న డేటా సెంటర్లకు అదనంగా ఈ కొత్త కేంద్రం సేవలను అందించనుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. క్లౌడ్, ఏఐ ఆధారిత డిజిటల్ ఎకానమీ కస్టమర్లకు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యూహాత్మకంగా ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది.
మైక్రోసాఫ్ట్ పోర్ట్ఫోలియోలో ఉన్న క్లౌడ్, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రొడెక్టివిటీ టూల్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్ మెంట్ లో సర్వీసులు ఇవ్వనుంది. వ్యాపార సంస్థలకు, స్టార్టప్స్, డెవలపర్స్, ఎడ్యుకేషన్, గవర్నెమంట్ సంస్థలకు ఈ సేవలు అందనున్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల వల్ల భారత్ లో త్తగా 15 లక్షల ఉద్యోగాలు వచ్చినట్లు ఓ స్టడీ ద్వారా తేలింది. దీనికి తోడు 169000 కొత్త ఐటీ జాబ్స్ ఇచ్చారు.
దేశంలో డేటా అవసరాలు రోజురోజుకూ పెరిగిపోతుండగా, సెంటర్లను నెలకొల్పడానికి పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ సంస్థలను ఆకర్షించడంలో హైదరాబాద్ నగరం ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం దేశంలోని డేటా సెంటర్ల సామర్థ్యం 30 మెగావాట్ల వరకూ ఉండగా, ఇది 2023 నాటికి 96 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. తెలంగాణ ప్రభుత్వ సానుకూల విధానాలు, ఐటీ నిపుణుల లభ్యత వంటి కారణాలతో డేటా కేంద్రాలు ఏర్పాటుకు కంపెనీలు హైదరాబాద్ వైపు మొగ్గుచూపుతున్నాయి. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్తో పాటు మరికొన్ని కంపెనీలు రాబోతున్నట్లు తెలుస్తోంది. డేటా సెంటర్తో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి.
మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్తో డిజిటల్ ఎకానమీలో పోటీతత్వం పెరుగుతుందని కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. అన్ని పరిశ్రమలు, రంగాల్లోనూ క్లౌడ్ కీలకంగా మారుతోందన్నారు.
తాజా వార్తలు
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్







