ఆర్బీఐ హైదరాబాద్ లో ఉద్యోగాలు..
- March 08, 2022
హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి ఈ రోజే ఆఖరుతేదీ. ముఖ్య వివరాలు.. మొత్తం పోస్టులు : 950 హైదరాబాద్ లో ఖాళీలు: 40 అర్హత : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 50% మార్కులతో డిగ్రీ పాస్ అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.అభ్యర్ధులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేయాలి.
వయసు: 2022 ఫిబ్రవరి 1 నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ.. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ ద్వారా ఎంపిక చేస్తారు. లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ స్థానిక భాషలో ఉంటుంది. హైదరాబాద్ అభ్యర్ధులకు తెలుగులో లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది. వేతనం: ఎంపికైన వారికి రూ.20,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.55,700
దరఖాస్తు ప్రక్రియ.. అభ్యర్ధులు ముందుగా https://opportunities.rbi.org.in/వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.Vacancies సెక్షన్ లో Assistant Recruitment నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. నియమ నిబంధనలన్నీ పూర్తిగా చదివిన తరువాత Recruitment for the post of Assistant 2021 లింక్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో click here for new registration పైన క్లిక్ చేయాలి. మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.
మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ వంటి వివరాలు నమోదు చేయాలి. రెండో దశలో ఫోటో, సంతకం అప్ లోడ్ చేయాలి. మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి. ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్ లోడ్ చేయాలి. ఆరో దశలో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు రూ.450, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.50 ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి. అభ్యర్ధులు ఫీజు పేమెంట్, దరఖస్తు సబ్మిషన్ 2022 మార్చి 8 లోగా పూర్తి చేయాలి. మార్చి 26,27 తేదీల్లో ఆన్ లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, మేలో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది.
తాజా వార్తలు
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం







