14 నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు

- March 09, 2022 , by Maagulf
14 నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ: ఈ నెల 14 నుంచి పార్లమెంటు రెండోవిడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి విడతలో ఉభయ సభలు కరోనా కారణంగా షిఫ్టు పద్ధతిలో పనిచేశాయి. అలాకాకుండా రెండో విడతలో ఎప్పటిలాగా సమాంతరంగా సమావేశమవుతాయి. లోక్‌సభ, రాజ్యసభ తమ చాంబర్స్‌లోనే పనిచేస్తాయి. కరోనా జాగ్రత్తల్లో భాగంగా దూరం పాటించేందుకు సభ్యుల సీటింగ్‌ కోసం అదనంగా గ్యాలరీలను కూడా వినియోగిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com