మిజోరం, సిక్కిం రాష్ట్రాల పర్యటనలో ఉపరాష్ట్రపతి

- March 09, 2022 , by Maagulf
మిజోరం, సిక్కిం రాష్ట్రాల పర్యటనలో ఉపరాష్ట్రపతి

ఐజ్వాల్: నాలుగురోజుల పర్యటన నిమిత్తం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మిజోరం, సిక్కిం రాష్ట్రాల పర్యటనకు విచ్చేశారు.ఈ సందర్భంగా మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, మిజోరం ఆరోగ్యం, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ లల్తాంగ్లియానా, రాజ్యసభ ఎంపీ కె.వన్లవేన, ఇతర ప్రముఖుల లెంగ్ పుయ్ విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం రాజ్ భవన్ లో ఉపరాష్ట్రపతి ని, మిజోరం ముఖ్యమంత్రి జోరంతుంగ మర్యాదపూర్వకంగా కలిశారు.

సాయంత్రం మిజోరం రాజ్ భవన్ లో గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలను, మిజోరం సంస్కృతిని ప్రతిబింబించే సర్లాంకై, చీలం, కెరా నృత్య రూపాలను ఉపరాష్ట్రపతి తిలకించారు. అనంతరం కళాకారులను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.మార్చి 10వ తేదీ ఉదయం మిజోరం అసెంబ్లీని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com