భారత్లోనే నెంబర్ 1 ఏపీ పోలీస్..
- March 10, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరో ఘనత సాధించింది. ప్రజలకు నాణ్యమైన భద్రత సేవలు అందించడంలో భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ పోలీస్ శాఖ రెండో స్థానంలో, గుజరాత్ పోలీస్ శాఖ మూడో స్థానంలో నిలిచాయి. 2021 సంవత్సరానికి గాను స్కోచ్ సంస్థ పోలీస్ మరియు భద్రత విభాగంలో వివిధ రాష్ట్రాల్లో పౌరులకు అందిస్తున్న సేవలపై అధ్యయనం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నట్లు గుర్తింపు నిచ్చింది.
పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ అంశాల్లో నూతనంగా, ఆధునిక విధానాలను ఆవిష్కరిస్తూ వాటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరే విధంగా అవలంభి పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందిస్తున్నందుకుగాను 23 అవార్డులను పోలీస్ శాఖ కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించిన సేవలకుగాను ఈ సంస్థ ప్రకటించిన 56 అవార్డుల్లో 23 అవార్డులు పోలీస్ శాఖకు రావడం విశేషం. 2020లో పోలీస్, భద్రత విభాగంలో ఏపీ పోలీస్ శాఖ మొదటి స్థానం దక్కించుకోగా ఈ సంవత్సరం కూడా మొదటి స్థానం నిలబెట్టుకుంది.
ప్రజా సమస్యల పట్ల క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది సకాలంలో స్పందిస్తూ వారి ఫిర్యాదుల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ చట్టపరంగా అందించాల్సిన న్యాయాన్ని భాదితులకు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు లభిస్తున్న అవార్డులు ఇందుకు నిదర్శనం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ దాని ద్వారా బాధితులకు రక్షణగా మేము ఉన్నాము అని పోలీసు శాఖ తెలిపింది. ప్రజలకు భరోసా కల్పిస్తూ వారికి దక్కాల్సిన న్యాయాన్ని అందిస్తూ భాదితుల మన్ననలను పొందుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం అని తెలిపారు.
తాజా వార్తలు
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!







