ఎన్నికలపై మోడీ మాటలకు ఏకీభవించని పీకే
- March 11, 2022
హైదరాబాద్: 2024 తీర్పును ప్రజలు 2022లోనే వెలువరించినట్లు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ తప్పుపట్టారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం తర్వాత నిన్న ప్రధాని మోదీ ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
అయితే ఆ సమయంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలపై సైకాలజికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేసినవేనన్నారు. ఇవాళ తన ట్విట్టర్లో స్పందించిన ప్రశాంత్ కిషోర్.. 2024 లోక్సభ ఎన్నికల పోరు ఆ ఏడాదిలోనే డిసైడ్ అవుతుందని, కానీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఆధారంగా 2024ను నిర్ణయించలేరన్నారు. ఈ విషయం సాహెబ్కు తెలుసు అని, కానీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఆధారంగా తమ పార్టీ వైపు అందర్నీ మళ్లించేందుకు ప్రధాని ఓ తెలివైన ప్రయత్నం చేస్తున్నారని, ప్రతిపక్షాలపై నిర్ణయాత్మక సైకాలజికల్ అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు జనం ఆకర్షితులు కావొద్దు అని, తప్పుదోవ పట్టించే రీతిలో ఆ వ్యాఖ్యలు ఉన్నట్లు ప్రశాంత్ కిషోర్ తన ట్వీట్లో తెలిపారు.
Battle for India will be fought and decided in 2024 & not in any state #elections
— Prashant Kishor (@PrashantKishor) March 11, 2022
Saheb knows this! Hence this clever attempt to create frenzy around state results to establish a decisive psychological advantage over opposition.
Don’t fall or be part of this false narrative.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







