రష్యాకు విమాన పరికరాలను నిలిపివేసిన చైనా
- March 11, 2022
యుక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యా పై ప్రపంచ దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అమెరికా, ఐరోపా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించగా..
ఆసియా దేశాలు అంతగా స్పందించలేదు. యుక్రెయిన్ పై రష్యా దాడులు ఆపకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రష్యాకు మద్దతిస్తున్న దేశాలపైనా విమర్శలు వస్తున్నాయి. రష్యాకు మిత్ర దేశాలైన భారత్, చైనాలు.. రష్యాను నిలువరించే ప్రయత్నం చేయడం లేదంటూ అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. అయితే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పటివరకు ప్రేక్షక పాత్ర పోషించిన చైనా కూడా రష్యాపై పాక్షిక ఆంక్షలకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం రష్యాకు విమాన పరికరాల సరఫరాను చైనా నిలిపివేసింది.
దీంతో రష్యాపై ఆంక్షలు విధిస్తున్న పశ్చిమదేశాల సరసన చైనా కూడా చేరినట్లయింది. రష్యాకు చైనా విమాన పరికరాల సరఫరా నిలిపివేతపై రోసావియాట్సియా(రష్యా) ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్వర్తినెస్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అధికారి వాలెరీ కుడినోవ్ స్పందిస్తూ.. రష్యాలోని విమానయాన సంస్థలు.. తమ సంస్థల తరుపున ప్రత్యకంగా చైనా సంస్థలతో సంప్రదింపులు జరుపుకోవాలని సూచించారు. రష్యాకు చైనా విమానపరికరాల నిలిపివేతతో.. రష్యా విమానయాన సంస్థల ద్రుష్టి ఇప్పుడు భారత్ లేదా టర్కీ దేశాలపై పడనుంది. యూరోప్ దేశాలు సైతం విమాన విడిభాగాల సరఫరా నిలిపివేయడంతో, రష్యా ఇకపై భారత్ పైనే ఆధారపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా వాలెరీ కుడినోవ్ చేసిన ప్రకటనపై రష్యాకు చెందిన ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ స్పందిస్తూ.. ఆయనకు ప్రకటనలు చేసే అధికారం లేదని పేర్కొంది. వాలెరీ కుడినోవ్ తన ఆధీనంలోని ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్వర్తినెస్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ యొక్క అధికారిక పనులు చక్కబెట్టడమే ఆయనకు ఇచ్చిన విధులని ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే.. చైనా నిజంగానే రష్యాపై ఆంక్షలకు దిగిందా? లేక ముడిసరుకు ఇబ్బందుల కారణంగా విమాన పరికరాల సరఫరా నిలిపివేసిందా అనే ప్రశ్న తెలత్తుతోంది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







