ఆదికి జోడీగా దిగంగన సూర్యవంశీ!
- March 11, 2022
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత కె. కె. రాధామోహన్ ప్రస్తుతం టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్లో 10వ చిత్రమిది. దీనితో ఫణికృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన కథానాయికగా నటించడానికి నటి దిగంగన సూర్యవంశీని ఖరారు చేశారు.
తెలుగు, హిందీ భాషలలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్లలో నటిస్తున్న దిగంగన ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాలో నటించడం పట్ల చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది. ‘హిప్పీ’ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దిగంగన గత ఏడాది విడుదలైన ‘సీటీమార్’లో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రంలో ప్రతిభావంతులైన సాంకేతిక బృందం పనిచేస్తోంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల కెమెరా బాధ్యతలు చేపట్టారు.ఈ చిత్రానికి గిడుతూరి సత్య ఎడిటర్గా వ్యవహరిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!







