'వరల్డ్ ఆర్ట్ దుబాయ్' లో తెలుగమ్మాయి
- March 12, 2022
హైదరాబాద్ కు చెందిన లక్ష్మి వక్కలంక సైన్సు లో ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి డిగ్రీ కంప్యూటరు ప్రోగ్రామింగు అభిరుచితో నేర్చుకుని స్వయంకృషితో ఆ రంగములో విశేష ప్రతిభకు దుబాయ్ ను వేదికగా చేసుకున్నారు.స్లాడ్స్ అడ్వరుటైజింగు సంస్థ నెలకొల్పి దుబాయ్ కేంద్రముగా చేసుకుని, హైదరాబాద్ లో కూడా బ్రాంచి స్థాపించారు.
గత 25 సంవత్సరాలుగా యూఏఈ లో నివసిస్తూ గత ఏడాది యూఏఈ గోల్డెన్ జూబ్లీ ఇయర్ జరుపుకుంటున్న వేళ తనకి ఒక ఆలోచన వచ్చింది.గత 50 సంవత్సరాలలో, ఒక 50 ముఖ్యమైన దేశ విజయాలు గానీ ముఖ్యమైన అభివృద్ధి విషయాలు గానీ ఎంచుకుని, "UAE's Accomplishments & Ambitions" అనే పేరిట 50 యక్రిలిక్ మిక్స్డ్ మీడియా పెయింటింగ్లు (80x100 సెం.మీ.) ఫ్రేమ్డ్ కాన్వాస్లు మీద చిత్రీకరించారు.
ప్రతి ఏటా దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC) వారు నిర్వహించే "వరల్డ్ ఆర్ట్ దుబాయ్" అనే ఆర్ట్ ఎక్సిబిషన్ లో ఈ నెల మార్చ్ 16 నుండి 19 వరకు జరగనుంది.ఈ ఆర్ట్ ఎక్సిబిషన్ లో లక్ష్మి వక్కలంక తన ఆర్ట్ వర్క్ ను ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!









