'వరల్డ్ ఆర్ట్ దుబాయ్' లో తెలుగమ్మాయి
- March 12, 2022
హైదరాబాద్ కు చెందిన లక్ష్మి వక్కలంక సైన్సు లో ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి డిగ్రీ కంప్యూటరు ప్రోగ్రామింగు అభిరుచితో నేర్చుకుని స్వయంకృషితో ఆ రంగములో విశేష ప్రతిభకు దుబాయ్ ను వేదికగా చేసుకున్నారు.స్లాడ్స్ అడ్వరుటైజింగు సంస్థ నెలకొల్పి దుబాయ్ కేంద్రముగా చేసుకుని, హైదరాబాద్ లో కూడా బ్రాంచి స్థాపించారు.
గత 25 సంవత్సరాలుగా యూఏఈ లో నివసిస్తూ గత ఏడాది యూఏఈ గోల్డెన్ జూబ్లీ ఇయర్ జరుపుకుంటున్న వేళ తనకి ఒక ఆలోచన వచ్చింది.గత 50 సంవత్సరాలలో, ఒక 50 ముఖ్యమైన దేశ విజయాలు గానీ ముఖ్యమైన అభివృద్ధి విషయాలు గానీ ఎంచుకుని, "UAE's Accomplishments & Ambitions" అనే పేరిట 50 యక్రిలిక్ మిక్స్డ్ మీడియా పెయింటింగ్లు (80x100 సెం.మీ.) ఫ్రేమ్డ్ కాన్వాస్లు మీద చిత్రీకరించారు.
ప్రతి ఏటా దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC) వారు నిర్వహించే "వరల్డ్ ఆర్ట్ దుబాయ్" అనే ఆర్ట్ ఎక్సిబిషన్ లో ఈ నెల మార్చ్ 16 నుండి 19 వరకు జరగనుంది.ఈ ఆర్ట్ ఎక్సిబిషన్ లో లక్ష్మి వక్కలంక తన ఆర్ట్ వర్క్ ను ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







