యార్మౌక్ కల్చరల్ సెంటర్లో ఘనంగా ‘స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియా’
- March 13, 2022
కువైట్: ఇండియా, కువైట్ మధ్య దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ రాయబార కార్యాలయం నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ (NCCAL) సహకారంతో కువైట్లో దార్ అల్-అథర్ అల్-ఇస్లామియా మ్యూజియం-యార్మౌక్ కల్చరల్లో స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియా - ఫెస్టివల్ని నిర్వహించింది. దార్ అల్-అథర్ అల్-ఇస్లామియా మ్యూజియం సీనియర్ అధికారులు, ఇతరఅధికారులతో కలిసి భారత రాయబారి సిబి జార్జ్ ఈ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం యొక్క సుసంపన్నమైన, విభిన్నమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని పురస్కరించుకుని కువైట్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఫెస్టివల్ లో భాగంగా ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ వంటకాలు, ఇండియాలో తయారు చేసిన అనేక సాంస్కృతిక కళారూపాలు, వస్తువులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే భారతీయ సినిమాలను పగటిపూట ప్రదర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









