యార్మౌక్ కల్చరల్ సెంటర్లో ఘనంగా ‘స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియా’
- March 13, 2022
కువైట్: ఇండియా, కువైట్ మధ్య దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ రాయబార కార్యాలయం నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ (NCCAL) సహకారంతో కువైట్లో దార్ అల్-అథర్ అల్-ఇస్లామియా మ్యూజియం-యార్మౌక్ కల్చరల్లో స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియా - ఫెస్టివల్ని నిర్వహించింది. దార్ అల్-అథర్ అల్-ఇస్లామియా మ్యూజియం సీనియర్ అధికారులు, ఇతరఅధికారులతో కలిసి భారత రాయబారి సిబి జార్జ్ ఈ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం యొక్క సుసంపన్నమైన, విభిన్నమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని పురస్కరించుకుని కువైట్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఫెస్టివల్ లో భాగంగా ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ వంటకాలు, ఇండియాలో తయారు చేసిన అనేక సాంస్కృతిక కళారూపాలు, వస్తువులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే భారతీయ సినిమాలను పగటిపూట ప్రదర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







