భారత జాలర్లు పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు
- April 01, 2016
భారత్కు చెందిన 59 మంది మత్స్యకారులను పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు. మత్స్యకారులకు చెందిన 10 పడవలను కూడా స్వాధీనం చేసుకున్నారు. భారత సరిహద్దు జలాలను దాటి తమ జలాల్లోకి వచ్చారంటూ పాకిస్థాన్ సముద్ర జలాల రక్షణ ఏజెన్సీ(ఎంఎస్ఏ) అధికారులు ఆరోపిస్తున్నారు. గుజరాత్, సింధ్ సరిహద్దుల్లో వివాదాస్పద సర్ క్రీక్ ప్రాంతంలో జాలర్లు వేటకు వెళ్లగా పాక్ అధికారులు జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. జాలర్లను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
వివాదాస్పద జలాల్లో చేపల వేట కారణంగా పాక్, భారత జాలర్లు తరచూ అరెస్టవుతుంటారు.
ఇటీవల పాకిస్థాన్ భారత్కు చెందిన 86 మంది జాలర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా మంది మత్స్యకారులు జైళ్లలో మగ్గుతున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







