భారత జాలర్లు పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు
- April 01, 2016
భారత్కు చెందిన 59 మంది మత్స్యకారులను పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు. మత్స్యకారులకు చెందిన 10 పడవలను కూడా స్వాధీనం చేసుకున్నారు. భారత సరిహద్దు జలాలను దాటి తమ జలాల్లోకి వచ్చారంటూ పాకిస్థాన్ సముద్ర జలాల రక్షణ ఏజెన్సీ(ఎంఎస్ఏ) అధికారులు ఆరోపిస్తున్నారు. గుజరాత్, సింధ్ సరిహద్దుల్లో వివాదాస్పద సర్ క్రీక్ ప్రాంతంలో జాలర్లు వేటకు వెళ్లగా పాక్ అధికారులు జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. జాలర్లను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
వివాదాస్పద జలాల్లో చేపల వేట కారణంగా పాక్, భారత జాలర్లు తరచూ అరెస్టవుతుంటారు.
ఇటీవల పాకిస్థాన్ భారత్కు చెందిన 86 మంది జాలర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా మంది మత్స్యకారులు జైళ్లలో మగ్గుతున్నారు.
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









