తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
- March 14, 2022
దోహా: తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపిన వివరాల ప్రకారం,
దోహా ఖతార్,ఇండియన్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం కార్యదర్శులు సుమన్ సోన్కర్ మరియు పద్మ కర్రి ముఖ్య అతిథులుగా హాజరు కాగా ప్రవాస భారత్ సమ్మాన్ అవార్డు గ్రహీత, ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ అధ్యక్షులు డా.మోహన్ థామస్, ఐసిసి అధ్యక్షుడు పిఎన్ బాబు, ఐసిసి జనరల్ సెక్రటరీ కృష్ణ కుమార్ బంధకవి,ఖతార్ లో తెలుగు విద్యావేత్త, సీనియర్ తెలుగు ప్రవాస నాయకులు ప్రసాద్ రావు కొడూరు గారు, ఖతార్ లో వివిధ తెలుగు సంఘాల అధ్యక్షులు తాతాజీ వుసిరికల, వెంకప్పా భాగవతుల,శంకర్ గౌడ్ విశిష్ట అతిథులుగా హాజరై మహిళా సాధికారత ఆవశ్యకతను తెలియచేశారు.
ఖతార్ లో వివిధ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నోసేవా కార్యక్రమాలు చేస్తూ , సాంస్కృతిక , సాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తాము ఏ రంగంలో అయినా ఎవరికీ తీసిపోమని నిరూపిస్తూ ఇతర మహిళలకు ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న
ఐసిబిఎఫ్ వైద్య సహాయ మరియు శిబిరాల ఇంచార్జి రజనీ మూర్తి, ట్రెజరర్ కుల్దీప్ కౌర్, ఐసీసీ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్లు జయతి బి మైత్ర, సొనల్ శర్మ, జకియా బిల్గ్రమి ఫారుఖి మరియు తమ జీవిత భాగస్వామి కి అన్ని వేళలా సహకరిస్తూ వాళ్లు అనుకున్న లక్ష్యాలను అందుకునేలా అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తు వారి విజయాల్లో కీలక భూమిక నిర్వహిస్తున్న వాణి ,విద్య మీనన్,రాధ మరియు మానసిక వైద్య నిపుణులు డా.హర్ష భాటియా ను ఈ సంధర్భంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన కళల పోటీ లో విజేతలుగా నిలిచిన వారికి మోమెంటోలను అంద చేశారు.
విదేశాల్లో మన భారత సాంప్రదాయ వస్త్రాధరణను ప్రొత్సాహించడానికి,ప్రచారాన్ని కల్పించాలనే సంకల్పంతో తలపెట్టిన ‘సంప్రదా, ఎన్ ఎక్సట్రా ఆర్డినెరీ నారీ ఇన్ సారీ’, ఆడపిల్లలకు 'బుట్ట బొమ్మ' అనే శీర్షిక తో నిర్వహించిన ఫాషన్ షొలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మహిళా మరియు శిశు అభివృద్ధి సలహాదారులు, సుమ గౌడ, ఫ్యాషన్ రంగ నిపుణులు సునైన కనుమర్లపూడి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టకున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)





తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







