కువైట్ లో నిరసన చేపట్టిన స్కూల్ క్లీనర్లు
- March 17, 2022
కువైట్: జీతాలు చెల్లించకపోవడంతో విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వందలాది మంది క్లీనింగ్ కంపెనీలకు చెందిన క్లీనర్లు నిరసన బాట పట్టారు. ఫర్వానియా ప్రాంతం మినహా 5 ప్రాంతాలలో క్లీనర్లు నిరసన చేపట్టారు. నిరసనలో భాగంగా వారందరూ విధులను బహిష్కరించారు. ఈ కార్మికులు కార్మిక మంత్రిత్వ శాఖ కాంట్రాక్టులపై పనిచేస్తున్నారు. కాగా క్లీనింగ్ కంపెనీలకు కొత్త కాంట్రాక్టులు జారీ చేయనున్నట్లు దీంతో పారిశుద్ధ్య సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విద్యాశాఖకు త్వరలో ఊరట లభిస్తుందని మంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారులు తెలిపారు. సంక్షోభాన్ని నివారించేందుకు మంత్రిత్వ శాఖలోని ఆర్థిక విభాగం క్లీనింగ్ కంపెనీలతో సమావేశమైందని త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. క్లీనింగ్ కార్మికులకు చివరగా గతేడాది జూలైలో జీతాలు చెల్లించారు. లేబర్ కంపెనీలు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడటంతో వాటి అకౌంట్లను స్తంభింపజేశారు. దాంతో దాదాపు 1,000 నుండి 1,100 మంది కార్మికులకు జీతాలు నిలిచిపోయాయి.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









