కువైట్ లో నిరసన చేపట్టిన స్కూల్ క్లీనర్లు
- March 17, 2022
కువైట్: జీతాలు చెల్లించకపోవడంతో విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వందలాది మంది క్లీనింగ్ కంపెనీలకు చెందిన క్లీనర్లు నిరసన బాట పట్టారు. ఫర్వానియా ప్రాంతం మినహా 5 ప్రాంతాలలో క్లీనర్లు నిరసన చేపట్టారు. నిరసనలో భాగంగా వారందరూ విధులను బహిష్కరించారు. ఈ కార్మికులు కార్మిక మంత్రిత్వ శాఖ కాంట్రాక్టులపై పనిచేస్తున్నారు. కాగా క్లీనింగ్ కంపెనీలకు కొత్త కాంట్రాక్టులు జారీ చేయనున్నట్లు దీంతో పారిశుద్ధ్య సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విద్యాశాఖకు త్వరలో ఊరట లభిస్తుందని మంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారులు తెలిపారు. సంక్షోభాన్ని నివారించేందుకు మంత్రిత్వ శాఖలోని ఆర్థిక విభాగం క్లీనింగ్ కంపెనీలతో సమావేశమైందని త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. క్లీనింగ్ కార్మికులకు చివరగా గతేడాది జూలైలో జీతాలు చెల్లించారు. లేబర్ కంపెనీలు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడటంతో వాటి అకౌంట్లను స్తంభింపజేశారు. దాంతో దాదాపు 1,000 నుండి 1,100 మంది కార్మికులకు జీతాలు నిలిచిపోయాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







