కువైట్ లో నిరసన చేపట్టిన స్కూల్ క్లీనర్లు
- March 17, 2022
కువైట్: జీతాలు చెల్లించకపోవడంతో విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వందలాది మంది క్లీనింగ్ కంపెనీలకు చెందిన క్లీనర్లు నిరసన బాట పట్టారు. ఫర్వానియా ప్రాంతం మినహా 5 ప్రాంతాలలో క్లీనర్లు నిరసన చేపట్టారు. నిరసనలో భాగంగా వారందరూ విధులను బహిష్కరించారు. ఈ కార్మికులు కార్మిక మంత్రిత్వ శాఖ కాంట్రాక్టులపై పనిచేస్తున్నారు. కాగా క్లీనింగ్ కంపెనీలకు కొత్త కాంట్రాక్టులు జారీ చేయనున్నట్లు దీంతో పారిశుద్ధ్య సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విద్యాశాఖకు త్వరలో ఊరట లభిస్తుందని మంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారులు తెలిపారు. సంక్షోభాన్ని నివారించేందుకు మంత్రిత్వ శాఖలోని ఆర్థిక విభాగం క్లీనింగ్ కంపెనీలతో సమావేశమైందని త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. క్లీనింగ్ కార్మికులకు చివరగా గతేడాది జూలైలో జీతాలు చెల్లించారు. లేబర్ కంపెనీలు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడటంతో వాటి అకౌంట్లను స్తంభింపజేశారు. దాంతో దాదాపు 1,000 నుండి 1,100 మంది కార్మికులకు జీతాలు నిలిచిపోయాయి.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









