‘క్రూడాయిల్ కొరతకు సౌదీ బాధ్యత వహించదు’
- March 22, 2022
సౌదీ: ప్రపంచ మార్కెట్లలో చమురు సరఫరాలో ఎటువంటి కొరత వచ్చినా దానికి బాధ్యత తమది కాదని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇటీవల ఇరాన్ మద్దతుగల ఉగ్రవాది హౌతీ మిలీషియా సౌదీలోని చమురు కేంద్రాలపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. బాలిస్టిక్ క్షిపణులతో టెర్రరిస్టులు విరుచుకుపడ్డారు. హౌతీ మిలీషియాలకు టెక్నాలజీని అందజేసి వారిని సన్నద్ధం చేయడంలో ఇరాన్ ప్రముఖ పాత్ర వహిస్తోందని సౌదీ ఆరోపిస్తుంది. అంతర్జాతీయ సమాజం ఈ విషయాన్ని తెలుసుకోవాలని స్పష్టం చేసింది. చమురు, గ్యాస్, శుద్ధి చేసిన ఉత్పత్తుల లక్ష్యంగా టెర్రరిస్టులు దాడులు చేయడం వెనుక ఇరాన్ కుట్ర దాగి ఉందని, ప్రపంచ దేశాలు గ్రహించాలని సౌదీ మరోసారి కోరింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







