అరుదైన మైల్స్టోన్కు చేరుకున్న అక్కినేని హీరో
- March 22, 2022
హైదరాబాద్: అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగచైతన్య... ఫస్ట్ మూవీ కమర్షియల్గా హిట్ ఇవ్వలేకపోయిన చైతూకి నటుడిగా మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తర్వాత చేసిన ఏ మాయ చేశావే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన సమంతతో ఏడడుగులు వేశాడు. కాకపోతే ఈ జంట నాలుగేళ్ళ వివాహ బంధం తర్వాత విడిపోయింది. ఇదిలావుండగా ఈ అక్కినేని హీరో సోషల్ మీడియాలో అరుదైన ఫీట్ అందుకున్నాడు..ఇన్స్టాగ్రామ్లో నాగచైతన్య ఫాలోవర్ల సంఖ్య 7 మిలియన్లకు చేరుకుంది. టాలీవుడ్ హీరోలలో 7 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన అతి తక్కువమంది సెలెబ్రెటీస్లో ఒకడిగా నిలిచాడు చైతూ.. స్టార్ హీరోలకి కూడా ఈ రేంజ్ ఫాలోయింగ్ లేకపోవడం విశేషం.
ఎన్టీఆర్ (3.6M), రామ్ చరణ్ (5.3M) మాత్రమే ఫాలోయింగ్ ఉంది. చైతూ ఇప్పుడు హిందీలో లాల్ సింగ్ చద్దాతో పాటుగా తెలుగులో దిల్ రాజు ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.
తాజా వార్తలు
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







