అరుదైన మైల్స్టోన్కు చేరుకున్న అక్కినేని హీరో
- March 22, 2022
హైదరాబాద్: అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగచైతన్య... ఫస్ట్ మూవీ కమర్షియల్గా హిట్ ఇవ్వలేకపోయిన చైతూకి నటుడిగా మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తర్వాత చేసిన ఏ మాయ చేశావే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన సమంతతో ఏడడుగులు వేశాడు. కాకపోతే ఈ జంట నాలుగేళ్ళ వివాహ బంధం తర్వాత విడిపోయింది. ఇదిలావుండగా ఈ అక్కినేని హీరో సోషల్ మీడియాలో అరుదైన ఫీట్ అందుకున్నాడు..ఇన్స్టాగ్రామ్లో నాగచైతన్య ఫాలోవర్ల సంఖ్య 7 మిలియన్లకు చేరుకుంది. టాలీవుడ్ హీరోలలో 7 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన అతి తక్కువమంది సెలెబ్రెటీస్లో ఒకడిగా నిలిచాడు చైతూ.. స్టార్ హీరోలకి కూడా ఈ రేంజ్ ఫాలోయింగ్ లేకపోవడం విశేషం.
ఎన్టీఆర్ (3.6M), రామ్ చరణ్ (5.3M) మాత్రమే ఫాలోయింగ్ ఉంది. చైతూ ఇప్పుడు హిందీలో లాల్ సింగ్ చద్దాతో పాటుగా తెలుగులో దిల్ రాజు ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







