ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. కేంద్రం స్పష్టం

- March 22, 2022 , by Maagulf
ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. కేంద్రం స్పష్టం

అమరావతి: ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేది లేద‌ని మ‌రోసారి తేల్చి చెప్పేసింది.ఇప్ప‌టికే ఏపీకి ప్ర‌త్యేక హోదా ముగిసిన అంశ‌మ‌ని పార్ల‌మెంటు సాక్షిగానే తెలిపిన కేంద్రం.. తాజాగా మ‌రోమారు ‘ఏపీకి ప్ర‌త్యేక హోదా లేదంటూ’ స్పష్టం చేసింది.ఈ మేర‌కు వైసీపీ ఎంపీ స‌త్య‌నారాయ‌ణ అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి నిత్యానంద‌రాయ్ లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు.

14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా సిఫారసు చేయలేదన్న కేంద్ర మంత్రి.. ఏపీ విభజన చట్టంలోని చాలా హామీలను నెరవేర్చామని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినట్ల స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com