బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
- March 24, 2022
భారత సైన్యం అమ్ములపొదిలోని శక్తిమంతమైన ఆయుధంగా పరిగణించే బ్రహ్మోజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. బుధవారం భారత ఆర్మీ అధికారులు ఈ క్షిపణిని అండమాన్ నికోబార్ దీవుల్లో విజయవంతంగా పరీక్షించారు. రష్యా సహకారంతో డీఆర్డీవో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణితో భూతలం నుంచి భూతలానికి, భూమి నుంచి యుద్ధ విమానాలు, యుద్ద నౌకల వంటి టార్గెట్లను ధ్వంసం చేయవచ్చు. తాజాగా బ్రహ్మోస్ మిస్సైల్ రేంజ్ పెరగ్గా.. ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు.
కాగా ఇటీవల మిస్ఫైర్తో పాకిస్తాన్లోకి ఓ సూపర్ సోనిక్ మిస్సైల్ దూసుకెళ్లి పేలిపోయిన విషయం తెలిసిందే. అది బ్రహ్మోస్ క్షిపణి అనే కథనాలు వచ్చినా భారత ప్రభుత్వం మాత్రం అది ఏరకం మిస్సైల్ అనే విషయం వెల్లడించలేదు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారని.. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వస్తాయని రక్షణశాఖ అధికారులు చెప్తున్నారు. కాగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం అయినందుకు రక్షణశాఖను ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అభినందించారు.
Congratulations to all the scientists and team of @DRDO_India on successful test firing of deadly surface to surface #BRAHMOS supersonic cruise missile in Andaman and Nicobar Islands.
— Kiren Rijiju (@KirenRijiju) March 24, 2022
A proud moment for India 🇮🇳 pic.twitter.com/rpn9MQ9JUc
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







