భారత్ కరోనా అప్డేట్

- March 25, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న కొత్తగా 1,685 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 83 మంది కోవిడ్ తదితర కారణాలతో కన్నుమూశారు.

దేశంలో ప్రస్తుతం 21,350 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4,30,16,372 కోవిడ్ కేసులు నమోదు కాగా వారిలో 5,16,755 మంది కోవిడ్ కారణంతో కన్ను మూశారు. నిన్న కోవిడ్ నుంచటి 2,499 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.05 శాతంగా ఉంది.ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,78,087కు చేరింది.

కాగా మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 182.55,75,126 టీకాలు వేశారు. నిన్న 29,82. 451 డోసులు టీకాలు వేసినట్లు  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com