ఏప్రిల్ 1 నుంచి ఇండియాకి వీక్లీ విమానాల్ని పెంచనున్న ఎమిరేట్స్

- March 25, 2022 , by Maagulf
ఏప్రిల్ 1 నుంచి ఇండియాకి వీక్లీ విమానాల్ని పెంచనున్న ఎమిరేట్స్

యూఏఈ: కోవిడ్ పాండమిక్ కంటే ముందున్న సాధారణ పరిస్థితుల్ని పునరుద్ధరించేందుకోసం ఎమిరేట్స్ చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ 1 నుంచి ఇండియాలోని వివిధ నగరాలకు వారంలో 170 విమాన సర్వీసుల్ని నడపనుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సంబంధించి భారత ప్రభుత్వం ఇటీవల కల్పించిన వెసులుబాట్ల నేపథ్యంలో ఎమిరేట్స్ ఈ చర్యలు తీసుకుంటోంది. కాగా, ఫ్లెక్సిబుల్ బుకింగ్ పాలసీలను కూడా మే 31 వరకు పొడిగించింది ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్. ముంబైకి వారంలో 35 విమానాలు, న్యూ ఢిల్లీకి 28 విమానాలు, బెంగళూరుకి 24 విమానాలు, చెన్నయ్ 21 విమానాలు, హైద్రాబాద్ 21 విమానాలు, కోచి 14 విమానాలు, కోల్‌కతా 11, అహ్మదాబాద్ 9, తిరువనంతపురం 7 వీక్లీ విమానాలు ఎమిరేట్స్ ద్వారా నిర్వహించబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com