ఎక్స్పో 2020 దుబాయ్ రష్: బస్సుల ట్రిప్పుల్ని పెంచిన ఆర్టీఏ
- March 26, 2022
యూఏఈ: మరో ఐదు రోజుల్లో ఎక్స్పో దుబాయ్ 2020 ముగియనున్న దరిమిలా, పెద్దయెత్తున, ఈ ఈవెంట్ సందర్శన కోసం వెళుతున్నారు. దాంతో, ఎక్స్పో 2020 దుబాయ్కి వెళ్ళే సందర్శకుల సౌకర్యార్థం బస్సుల ట్రిప్పుల్ని ఆర్టీఏ పెంచింది. అనూహ్యంగా పెరిగిన సందర్శకుల తాకిడి నేపథ్యంలో వారికి రవాణా సౌకర్యం పరంగా ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ - ఆర్టీయే డైరెక్టర్ ఆఫ్ బస్సెస్ మొహమ్మద్ అల్ అలి చెప్పారు. జుబైల్ బస్టాండ్ వద్ద ఎక్స్పో దుబాయ్కి వెళ్ళే డబుల్ డెక్కర్ బస్సుల్లో చోటు కోసం సందర్శకులు కిక్కిరిసిపోయినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్కంలో బస్సుల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. ఒక్కో బస్సులో 74 మంది ప్రయాణించే వీలుంది. షార్జా నుంచి ఉచితంగా ప్రయాణించేందుకు ఎక్స్పో రైడర్స్ అందుబాటులో వుంటాయిగానీ, ఇవి పరిమితం. ఆర్టీయే బస్సులు అల్ బరాహా లేదా అల్ ఘుబైబా బస్ స్టేషన్లకు అందుబాటులో వుంటాయి. అక్కడి నుంచి దుబాయ్ మెట్రో ద్వారా ఎక్స్పోకి వెళ్ళొచ్చు. బస్టాండ్లన్నీ కిక్కిరిసి వుంటున్నాయనీ, ఇప్పటికే పలుమార్లు ఎక్స్పోకి వెళ్ళినా కొన్ని పెవిలియన్లను మిస్ అయిన దరిమిలా, మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నట్లు షార్జా వాసులు కొందరు చెబుతున్నారు.
తాజా వార్తలు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!







