ఎక్స్పో 2020 దుబాయ్ రష్: బస్సుల ట్రిప్పుల్ని పెంచిన ఆర్టీఏ
- March 26, 2022
యూఏఈ: మరో ఐదు రోజుల్లో ఎక్స్పో దుబాయ్ 2020 ముగియనున్న దరిమిలా, పెద్దయెత్తున, ఈ ఈవెంట్ సందర్శన కోసం వెళుతున్నారు. దాంతో, ఎక్స్పో 2020 దుబాయ్కి వెళ్ళే సందర్శకుల సౌకర్యార్థం బస్సుల ట్రిప్పుల్ని ఆర్టీఏ పెంచింది. అనూహ్యంగా పెరిగిన సందర్శకుల తాకిడి నేపథ్యంలో వారికి రవాణా సౌకర్యం పరంగా ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ - ఆర్టీయే డైరెక్టర్ ఆఫ్ బస్సెస్ మొహమ్మద్ అల్ అలి చెప్పారు. జుబైల్ బస్టాండ్ వద్ద ఎక్స్పో దుబాయ్కి వెళ్ళే డబుల్ డెక్కర్ బస్సుల్లో చోటు కోసం సందర్శకులు కిక్కిరిసిపోయినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్కంలో బస్సుల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. ఒక్కో బస్సులో 74 మంది ప్రయాణించే వీలుంది. షార్జా నుంచి ఉచితంగా ప్రయాణించేందుకు ఎక్స్పో రైడర్స్ అందుబాటులో వుంటాయిగానీ, ఇవి పరిమితం. ఆర్టీయే బస్సులు అల్ బరాహా లేదా అల్ ఘుబైబా బస్ స్టేషన్లకు అందుబాటులో వుంటాయి. అక్కడి నుంచి దుబాయ్ మెట్రో ద్వారా ఎక్స్పోకి వెళ్ళొచ్చు. బస్టాండ్లన్నీ కిక్కిరిసి వుంటున్నాయనీ, ఇప్పటికే పలుమార్లు ఎక్స్పోకి వెళ్ళినా కొన్ని పెవిలియన్లను మిస్ అయిన దరిమిలా, మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నట్లు షార్జా వాసులు కొందరు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







