'బంతిపూల జానకి' చిత్రం పోస్టర్ను మెహన్లాల్ విడుదల చేశారు...
- April 02, 2016
ధన్రాజ్, దీక్షాపంత్ జంటగా నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణి రామ్ నిర్మిస్తున్న చిత్రం 'బంతిపూల జానకి'. ఈ చిత్రం గురువారంతో షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో గుమ్మడి కాయ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ధన్రాజ్ మాట్లాడుతూ, 'ఇటీవల మాలయాళ సూపర్స్టార్ మెహన్లాల్ మా చిత్రం పోస్టర్ను విడుదల చేశారు. ఆ పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. ఆయన పోస్టర్ విడుదల చేసిన వేళా విశేషమేంటోగాని షూటింగ్ మొత్తం అనుకున్నది అనుకున్నట్లుగా అంతా బాగా జరిగింది. నిర్మాత కళ్యాణిరామ్ మాపై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించారు.ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు కునేలా ఈ చిత్రాన్ని చేశాం. మంచి కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రంలో జబర్దస్త్ బ్యాచ్ చేసే కామెడీ హైలెట్గా ఉంటుంది. ఈ చిత్ర కథకు హీరోగా సెట్ అవుతానని దర్శకుడు నన్ను సెలక్ట్ చేసుకున్నారు. డబ్బు కోసం కాకుండా వృత్తి సంతృప్తి కోసం ఈ చిత్రంలో నటించాను. అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాను' అని అన్నారు. 'నాకిది రెండో చిత్రం. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశాం. సినిమా కోసం ధన్రాజ్ అందించిన సహకారం మరువలేనిది. అవుట్ అండ్ అవుట్ థ్రిల్లింగ్ కామెడీతో సాగే చిత్రమిది' అని దర్శకుడు తెలిపారు. దీక్షాపంత్ మాట్లాడుతూ, 'ఇందులో జానకి పాత్రలో నటిస్తున్నాను. సినిమా విడుదలైన తర్వాత అందరూ నన్ను జానకి అనే పిలుస్తారు. అంతగా నా పాత్ర ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నాను' అని చెప్పారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







