తొలిసారిగా ఫాస్టెస్ట్ ట్రైన్ గటిమాన్ ఎక్స్‌ప్రెస్

- April 02, 2016 , by Maagulf
తొలిసారిగా ఫాస్టెస్ట్ ట్రైన్ గటిమాన్ ఎక్స్‌ప్రెస్

భారతదేశ రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ఫాస్టెస్ట్ ట్రైన్ గటిమాన్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 5న పట్టాలపై రానుంది. గటిమాన్ ఎక్స్‌ప్రెస్‌ను హజరత్ నిజాముద్దీన్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ నుంచి ఆగ్రాకు మధ్య 184 కిలోమీటర్లు. ఈ 184 కిలోమీటర్ల దూరాన్ని కేవలం నిమిషాల్లో చేరుకోనుంది. ఈ రైలు గరిష్టంగా 160 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ గంటకు 150 కేఎంపీహెచ్ వేగంతో వెళ్తుంది. గటిమాన్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు -ఉచిత వైఫై-12 కోచ్‌లు.. 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లు, 8 కార్ చైర్‌లు, 2 పాంట్రీ కోచ్‌లు -ప్రయాణికులను అప్రమత్తం చేసే విధంగా ఆటోమేటిక్ అలారం సిస్టం-అత్యవసరంగా రైలును ఆపే పద్ధతి-ప్రతి కోచ్‌కు ప్రత్యేకంగా తలుపులు అమర్చి ఉంటాయి-శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ కంటే 25 శాతం అధికంగా ఛార్జీలు చెల్లించాలి-బయో టాయిలెట్స్, ఎల్‌ఈడీ లైట్స్, ఇతర అధునాతన సౌకర్యాలు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com