తొలిసారిగా ఫాస్టెస్ట్ ట్రైన్ గటిమాన్ ఎక్స్ప్రెస్
- April 02, 2016
భారతదేశ రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ఫాస్టెస్ట్ ట్రైన్ గటిమాన్ ఎక్స్ప్రెస్ ఈ నెల 5న పట్టాలపై రానుంది. గటిమాన్ ఎక్స్ప్రెస్ను హజరత్ నిజాముద్దీన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ నుంచి ఆగ్రాకు మధ్య 184 కిలోమీటర్లు. ఈ 184 కిలోమీటర్ల దూరాన్ని కేవలం నిమిషాల్లో చేరుకోనుంది. ఈ రైలు గరిష్టంగా 160 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం శతాబ్ధి ఎక్స్ప్రెస్ గంటకు 150 కేఎంపీహెచ్ వేగంతో వెళ్తుంది. గటిమాన్ ఎక్స్ప్రెస్ ప్రత్యేకతలు -ఉచిత వైఫై-12 కోచ్లు.. 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్లు, 8 కార్ చైర్లు, 2 పాంట్రీ కోచ్లు -ప్రయాణికులను అప్రమత్తం చేసే విధంగా ఆటోమేటిక్ అలారం సిస్టం-అత్యవసరంగా రైలును ఆపే పద్ధతి-ప్రతి కోచ్కు ప్రత్యేకంగా తలుపులు అమర్చి ఉంటాయి-శతాబ్ధి ఎక్స్ప్రెస్ కంటే 25 శాతం అధికంగా ఛార్జీలు చెల్లించాలి-బయో టాయిలెట్స్, ఎల్ఈడీ లైట్స్, ఇతర అధునాతన సౌకర్యాలు
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







