బహ్రెయిన్ లో ‘డిజిటల్’ రెసిడెన్సీ పర్మిట్ స్టిక్కర్లు
- March 29, 2022
బహ్రెయిన్: జాతీయ ఇ-గవర్నమెంట్ పోర్టల్http://bahrain.bh ద్వారా రెసిడెన్సీ స్టిక్కర్ల డిజిటలైజేషన్ను ప్రకటించింది. దీని ద్వారా సిటిజన్స్, వ్యాపార యజమానులు, రెసిడెంట్స్ ప్రయోజనం పొందవచ్చు. రెసిడెన్సీ పర్మిట్ స్టిక్కర్లు ఇకపై నివాసితులు, వారి కుటుంబాలు, కంపెనీలు, సంస్థల యజమానుల పాస్పోర్ట్ పై స్టాంప్ చేయవలసిన అవసరం లేదు. అనుమతులను QR కోడ్తో ఆన్లైన్లో రెన్యూవల్ చేయడంతోపాటు ముద్రించవచ్చు. వాటిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ-మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు. జాతీయ పోర్టల్ నుండి రూపొందించబడిన ఎలక్ట్రానిక్ కీ సేవ (eKey) ద్వారా వచ్చిన వారి కోసం అనుమతులు డిజిటల్గా మంజూరు చేస్తారు. ఈ సర్వీస్ 24 గంటలపాటు అందుబాటులో ఉంటుంది. ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయవచ్చు. జాతీయత, పాస్పోర్ట్ లు, నివాస వ్యవహారాలను అత్యధిక నాణ్యతతో సర్వీసులను అందించేందుకు డిజిటలైజేషన్ లో భాగంగా ఈ సర్వీసును ప్రవేశపెట్టినట్టు సంబంధిత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసేకు రాష్ట్రపతి నుండి క్రెడెన్షియల
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!
- మొహర్రంకు ముందు హుస్సేనియా ప్రతినిధులతో సమావేశం..!!
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్









