ఎక్స్‌పో 2030 రియాద్ కోసం క్యాంపెయిన్ ప్రారంభించిన సౌదీ అరేబియా

- March 29, 2022 , by Maagulf
ఎక్స్‌పో 2030 రియాద్ కోసం క్యాంపెయిన్ ప్రారంభించిన సౌదీ అరేబియా

ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో సౌదీ అరేబియా పెవిలియన్ పట్ల సందర్శకులు ప్రత్యేక ఆసక్తి చూపించారు. లక్షలాది మంది సౌద అరేబియా పెవిలియన్‌ని సందర్శించారు. ఇక, ఎక్స్‌పో 2030 రియాద్ కోసం ‘బిడ్’ క్యాంపెయిన్ అప్పుడే ప్రారంభించేసింది సౌదీ అరేబియా.పోటీలో సౌదీ అరేబియాతోపాటు సౌత్ కొరియా, ఇటలీ, ఉక్రెయిన్ మరియు రష్యా వున్నాయి. సౌదీ అరేబియా చరిత్ర, సంస్కృతి వంటి విషయాలపై సందర్శకులు ఈ ఎక్స్‌పోలో తెలుసుకోవడానికి ప్రత్యేక ఆసక్తి చూపారని నిర్వాహకులు తెలిపారు. కాగా, సౌదీ రాజధాని రియాద్ 2030 ఎక్స్‌పో కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించగల సత్తా కలిగి వుందని ఈ మేరకు రాయల్ కమిషన్ ఫర్ రియాద్ సిటీ ప్రకటించింది. 2030 వరల్డ్ ఎక్స్‌పో కోసం పలు అత్యద్భుతమైన ప్రాజెక్టుల్ని ఇప్పటికే చేపట్టడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com