ఇండియన్ ఎంబసీ ఎంప్లాయ్ అరెస్ట్
- March 30, 2022
సౌదీ: ఓ మహిళను ఫోన్లో వేధించినందుకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగి ప్రణవ్ కృష్ణని అరెస్టు చేశారు. సౌదీ అరేబియా నుంచి దక్షిణ భారత రాష్ట్రం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో దిగుతుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతనిపై భారత పోలీసులు ఏడాది క్రితం లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. సౌదీలోని ఇండియన్ ఎంబసీలో పనిచేస్తున్న ప్రణవ్ కృష్ణ సెలవుల కోసం కేరళకు వచ్చారు. లుకౌట్ నోటీసు ఆధారంగా ఎయిర్పోర్టు అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రణవ్ అంతర్జాతీయ నంబర్లు, ఇంటర్నెట్ ద్వారా మహిళలను వేధించేవాడని సమాచారం. అతను దాదాపు ఏడాదిన్నర కాలంగా ఓ మహిళను ఇబ్బంది పెడుతున్నాడని, ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







