ఇండియన్ ఎంబసీ ఎంప్లాయ్ అరెస్ట్
- March 30, 2022
సౌదీ: ఓ మహిళను ఫోన్లో వేధించినందుకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగి ప్రణవ్ కృష్ణని అరెస్టు చేశారు. సౌదీ అరేబియా నుంచి దక్షిణ భారత రాష్ట్రం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో దిగుతుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతనిపై భారత పోలీసులు ఏడాది క్రితం లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. సౌదీలోని ఇండియన్ ఎంబసీలో పనిచేస్తున్న ప్రణవ్ కృష్ణ సెలవుల కోసం కేరళకు వచ్చారు. లుకౌట్ నోటీసు ఆధారంగా ఎయిర్పోర్టు అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రణవ్ అంతర్జాతీయ నంబర్లు, ఇంటర్నెట్ ద్వారా మహిళలను వేధించేవాడని సమాచారం. అతను దాదాపు ఏడాదిన్నర కాలంగా ఓ మహిళను ఇబ్బంది పెడుతున్నాడని, ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









