ఇండియన్ ఎంబసీ ఎంప్లాయ్ అరెస్ట్
- March 30, 2022
సౌదీ: ఓ మహిళను ఫోన్లో వేధించినందుకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగి ప్రణవ్ కృష్ణని అరెస్టు చేశారు. సౌదీ అరేబియా నుంచి దక్షిణ భారత రాష్ట్రం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో దిగుతుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతనిపై భారత పోలీసులు ఏడాది క్రితం లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. సౌదీలోని ఇండియన్ ఎంబసీలో పనిచేస్తున్న ప్రణవ్ కృష్ణ సెలవుల కోసం కేరళకు వచ్చారు. లుకౌట్ నోటీసు ఆధారంగా ఎయిర్పోర్టు అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రణవ్ అంతర్జాతీయ నంబర్లు, ఇంటర్నెట్ ద్వారా మహిళలను వేధించేవాడని సమాచారం. అతను దాదాపు ఏడాదిన్నర కాలంగా ఓ మహిళను ఇబ్బంది పెడుతున్నాడని, ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









