ఇండియాకు ఫ్లైట్స్ షెడ్యూల్ ప్రకటించిన ఎమిరేట్స్
- March 30, 2022
యూఏఈ: దుబాయ్ ఆధారిత క్యారియర్ ఎమిరేట్స్ ఏప్రిల్ 1, 2022 నుండి ఇండియాలోని పలు నగరాలకు ప్రీ-పాండమిక్ ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇండియాలోని తొమ్మిది నగరాలకు వారానికి 170 విమానాలను నడుపనున్నట్లు వెల్లడించింది. ముంబై- 35 (వీక్లీ ఫ్లైట్స్), న్యూఢిల్లీ- 28, బెంగళూరు – 24, చెన్నై – 21, హైదరాబాద్ – 21, కొచ్చి – 14, కోల్కతా – 11, అహ్మదాబాద్ – 9, తిరువనంతపురం – 7 చొప్పున విమానాలను నడుపనున్నారు. అదే సమయంలో ఎమిరేట్స్ తన ఎయిర్బస్ A380, ఫ్లైట్ EK 500/501 డబుల్ డెక్కర్ లను ఈ నెల నుంచి దుబాయ్-ముంబై మధ్య తిరిగి ప్రారంభించనుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నుండి ఫస్ట్, బిజినెస్ క్లాస్లో ప్రయాణించే కస్టమర్లు ఎయిర్లైన్స్ గ్లోబల్ నెట్వర్క్ లోని ఎంపిక చేసిన ప్రదేశాల నుంచి ఎయిర్ పోర్ట్ వరకు కాంప్లిమెంటరీ డ్రైవ్ సర్వీస్ ను పొందవచ్చని ఎయిర్లైన్ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









