డ్రైవర్లు లేని వాహనాల సేవలు 2023లో ప్రారంభం
- March 31, 2022
యూఏఈ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఎక్స్పో 2020 దుబాయ్ వద్ద ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2022కి హాజరై, క్రూయిజ్ ఐఎన్సి, అమెరికా రూపొందించిన అటానమస్ (డ్రైవర్లు లేని వాహనాలు) వాహనాన్ని పరిశీలించారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, క్రూయిజ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్రైవర్ లేని వాహనాలు అలాగే ఇ- బుకింగ్ సర్వీసుల విషయమై ఈ ఒప్పందం కుదిరింది. RTA చీఫ్ మట్టర్ అల్ తాయెర్ మాట్లడుతూ, ఆర్టీయే తమ తొలి అటానమస్ వాహన సేవల్ని 2023లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 2030 నాటికి ఈ వాహనాల సంఖ్య 4,000కి పెంచనున్నామని అన్నారు. ఈ డ్రైవర్ లెస్ వాహనాలకు అత్యాధునిక సాంకేతికతను జోడించారు. ప్రమాద రహితంగా వీటిని తీర్చిదిద్దారు. వాహనంలోకి ఎక్కాక, తాము దిగాల్సిన చోట దిగేందుకు వీలుగా అంతా ఆటోమేటిక్ సిస్టమ్ ఇందులో పొందుపరిచారు.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









