డ్రైవర్లు లేని వాహనాల సేవలు 2023లో ప్రారంభం
- March 31, 2022
యూఏఈ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఎక్స్పో 2020 దుబాయ్ వద్ద ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2022కి హాజరై, క్రూయిజ్ ఐఎన్సి, అమెరికా రూపొందించిన అటానమస్ (డ్రైవర్లు లేని వాహనాలు) వాహనాన్ని పరిశీలించారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, క్రూయిజ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్రైవర్ లేని వాహనాలు అలాగే ఇ- బుకింగ్ సర్వీసుల విషయమై ఈ ఒప్పందం కుదిరింది. RTA చీఫ్ మట్టర్ అల్ తాయెర్ మాట్లడుతూ, ఆర్టీయే తమ తొలి అటానమస్ వాహన సేవల్ని 2023లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 2030 నాటికి ఈ వాహనాల సంఖ్య 4,000కి పెంచనున్నామని అన్నారు. ఈ డ్రైవర్ లెస్ వాహనాలకు అత్యాధునిక సాంకేతికతను జోడించారు. ప్రమాద రహితంగా వీటిని తీర్చిదిద్దారు. వాహనంలోకి ఎక్కాక, తాము దిగాల్సిన చోట దిగేందుకు వీలుగా అంతా ఆటోమేటిక్ సిస్టమ్ ఇందులో పొందుపరిచారు.
తాజా వార్తలు
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం
- WhatsApp new feature:మెసేజ్లు ఓపెన్ చేయకుండానే సారాంశం చూసేయండి!
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!









