డ్రైవర్లు లేని వాహనాల సేవలు 2023లో ప్రారంభం
- March 31, 2022
యూఏఈ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఎక్స్పో 2020 దుబాయ్ వద్ద ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2022కి హాజరై, క్రూయిజ్ ఐఎన్సి, అమెరికా రూపొందించిన అటానమస్ (డ్రైవర్లు లేని వాహనాలు) వాహనాన్ని పరిశీలించారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, క్రూయిజ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్రైవర్ లేని వాహనాలు అలాగే ఇ- బుకింగ్ సర్వీసుల విషయమై ఈ ఒప్పందం కుదిరింది. RTA చీఫ్ మట్టర్ అల్ తాయెర్ మాట్లడుతూ, ఆర్టీయే తమ తొలి అటానమస్ వాహన సేవల్ని 2023లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 2030 నాటికి ఈ వాహనాల సంఖ్య 4,000కి పెంచనున్నామని అన్నారు. ఈ డ్రైవర్ లెస్ వాహనాలకు అత్యాధునిక సాంకేతికతను జోడించారు. ప్రమాద రహితంగా వీటిని తీర్చిదిద్దారు. వాహనంలోకి ఎక్కాక, తాము దిగాల్సిన చోట దిగేందుకు వీలుగా అంతా ఆటోమేటిక్ సిస్టమ్ ఇందులో పొందుపరిచారు.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







