టీఎస్ఆర్టీసీ ఉగాది ఆఫర్...
- March 31, 2022
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత… వినూత్న తరహాలో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని లాభాల బాట పట్టించే పనిలో పడిపోయారు సజ్జనార్..ఇక, ఏ పండుగ వచ్చినా..? ఏ ప్రత్యేక ఉన్నా..? ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు తీసుకున్నారు.. తాజాగా మరో ఆఫర్ తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ… ఉగాది పండుగ సందర్భంగా 65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం తీసుకొచ్చింది.
అయితే, ఉగాది పండగ సందర్భంగా కేవలం ఏప్రిల్ 2వ తేదీన.. అంటే పండుగ రోజు మాత్రమే ఈ ఉచిత ప్రయాణం సౌలభ్యం ఉంటుంది.. బస్సుల్లో ప్రయాణించేటపుడు తమ దగ్గర ఉన్న గుర్తింపు కార్డును (65 ఏళ్లు దాటినట్లు) కండక్టర్కు చూపించి ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. ఉగాది సందర్భంగా ఈ ప్రత్యేకమైన ఆఫర్ తీసుకొచ్చినట్టు వెల్లడించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!
- పాలస్తీనా గుర్తింపు శాశ్వత శాంతికి మార్గం: సయ్యద్ బదర్
- ఎయిర్పోర్ట్లో బాంబ్ హెచ్చరిక..అప్రమత్తమైన సిబ్బంది
- భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందా?
- ఆసియా కప్ ఫైనల్లో భారత్ vs పాకిస్థాన్..