రేపే ఉగాది పురస్కారాలు ..
- April 01, 2022
హైదరాబాద్: చరిత్రలో మొట్టమొదటి సారిగా తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ ల కళాకారులకు అవార్డులు ఇవ్వడం అనే ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక, కూనిరెడ్డి ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో శుభకృతు నామ సంవత్సర ఉగాది నాడు సాయంత్రం 6 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్ లో ఉగాది సినీ పురస్కారాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ బాధ్యులు డైరెక్టర్ బాబ్జీ, కూనిరెడ్డి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ నిర్మాత , నటుడు, "మా" పూర్వాధ్యక్షులు మురళీమోహన్, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, ప్రముఖ నిర్మాత, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ , నిర్మాత , ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ , తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇంకా అనేక మంది చిత్ర ప్రముఖులు హాజరు కానున్నారని వారు తెలిపారు.గతంలో సినిమా అవార్డులు అనగానే కేవలం నటీనటులు, దర్శకులు , నిర్మాతలు, ప్రధాన టెక్నీషియన్ లకు మాత్రమే పరిమితమయ్యేవనీ.. మిగిలిన విభాగాలను పరిగణన లోనికి తీసుకునే వారు కాదనీ .. ఆ సంప్రదాయానికి తెర దించుతూ సినిమా పరిశ్రమకు మూలాధారమైన అన్ని శాఖలను గౌరవించాలనే సదుద్దేశ్యంతో సినీ దిగ్గజాలు దాసరి, డి.రామానాయుడు, దొరస్వామిరాజు (డిడిడి) పేర్లతో "ఉగాది సినిమా పురస్కారాలు" అందివ్వడం జరుగుతుందని..ఈ సంప్రదాయాన్ని ప్రతి ఏటా ఇలాగే కొనసాగిస్తామని కమిటీ నిర్వాహకులు తెలియజేశారు.
తాజా వార్తలు
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్







