దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- September 26, 2025
యూఏఈ: ప్రపంచంలోనే అత్యుత్తమమైన, అత్యంత అందమైన నగరంగా ఉండేలా చర్యలు తీసుకునేందుకు వీలుగా కొత్త "సివిలిటీ కమిటీ"ని దుబాయ్ ఏర్పాటు చేసింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ మేరకు కమిటీ ఏర్పాటును ప్రకటించారు.
ఈ కమిటీకి ఛైర్ గా మహ్మద్ అల్ గెర్గావి, మత్తర్ అల్ తాయర్ డిప్యూటీ చైర్గా ఉండగా, సభ్యులుగా అబ్దుల్లా అల్ బస్తీ, ఒమర్ అల్ ఒలామా, అబ్దుల్లా అల్ మర్రి, హెలాల్ అల్ మర్రి , మర్వాన్ బిన్ గాలితాను నియమించారు.
దుబాయ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని, అత్యంత అందమైనదని మొహమ్మద్ బిన్ రషీద్ లీడర్షిప్ ఫోరమ్లో దుబాయ్ పాలకుడు తన ఆలోచనలను వ్యక్తం చేసిన తర్వాత, షేక్ హమ్దాన్ తన తండ్రి దృష్టిని వాస్తవం రూపంలోకి తీసుకొచ్చేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు షేక్ హమ్దాన్ తెలిపారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







