రమదాన్.. 114 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- April 03, 2022
ఫుజైరా: వివిధ దేశాలకు చెందిన 114 మంది ఖైదీలకు రమదాన్ సందర్భంగా సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు ఫుజైరా పాలకుడు H.H. షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కీ క్షమాభిక్ష ప్రసాదించాడు. ఆయన ఆదేశాల మేరకు త్వరలోనే వారిని విడుదల చేయనున్నారు. సత్ప్రవర్తనను నిరూపించుకున్న ఖైదీలకు మాత్రమే క్షమాభిక్ష ప్రసాదించారు. వారు తమ కుటుంబాలతో పవిత్రమైన రమదాన్ మరియు ఈద్ ఎల్ ఫితర్ మాసాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉదారమైన నిర్ణయం తీసుకున్న షేక్ హమద్కు ఫుజైరా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ బిన్ ఘనేమ్ అల్ కాబి కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









