హైదరాబాద్: బంజారాహిల్స్ సీఐ శివచంద్ర సస్పెండ్
- April 03, 2022
హైదరాబాద్: బంజారాహిల్స్ సీఐ శివచంద్ర పై సస్పెన్షన్ వేటు పడింది. డ్రగ్స్ కేసులో సీఐ శివచంద్ర స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు.పేర్లు మాత్రమే రాసుకుని పంపించామని తెలిపారు.నాగబాబు కుమార్తె కనిపించలేదన్నారు. మీడియా ప్రతినిధులు వెళ్లిపోవాలంటూ సీఐ హడావుడి చేశారు. ఎలాంటి క్లారిటీ లేదన్నారు.వివరాలు వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్పై అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు దాడులు చేశారు.సమయం దాటిన తర్వాత కూడా నిర్వహిస్తున్నారనే సమాచారంతో రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహిస్తున్న ఫుడింగ్ మింగ్ పబ్పై రైడ్ చేశారు. అక్కడికి పోలీసులు వెళ్లేసరికి దాదాపు 150 మంది యువతీ యువకులు.. ప్రపంచంతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు.తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలోనూ మత్తులో జోగుతూ.. తూలుతున్న కాళ్లతోనే డ్యాన్స్లు చేస్తున్నారు.
వెంటనే పబ్ నిర్వాహకులతో పాటు 150 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వారిలో 40 మంది వరకు యువతులు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నాడు. ఫారినర్స్ కూడా ఉన్నారు. వీరి వివరాలు సేకరించి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. పిలిచినప్పుడు రావాలంటూ వారిని ఇంటికి పంపించారు. అయితే వీరంతా.. తమను ఎందుకు తీసుకొచ్చారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.
అందరూ బడా వ్యాపారులు, రాజకీయ నేతలకు సంబంధించిన పిల్లలు కూడా ఉండటంతో పోలీసులు కూడా ఎక్కువగా స్పందించలేకపోతున్నట్టు సమాచారం. ఇక పబ్లో రేవ్ పార్టీ జరిగిందంటూ ప్రచారం జరిగింది. దీంతో ఉన్నతాధికారులు కూడా దీనిపై ఆరా తీశారు. అయితే పబ్లో రేవ్ పార్టీలు ఏమీ జరగలేదని.. జస్ట్ టైమ్ దాటిన తర్వాత కూడా నిర్వహిస్తుండటంతోనే రైడ్ చేసినట్టు పోలీసులు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







