భారత్లో భారీగా తగ్గిన కరోనా కేసులు..
- April 04, 2022
న్యూ ఢిల్లీ: భారతదేశంలో గతంలో కన్నా తక్కువ కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.లక్షల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు…ఇప్పుడు వేల సంఖ్యకు చేరుకున్నాయి.మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. తాజాగా.. 24 గంటల్లో 913 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 13 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. ఈ మేరకు 2022, ఏప్రిల్ 04వ తేదీ సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ప్రస్తుతం దేశంలో 12,597 యాక్టివ్ కేసులున్నట్లు, దేశంలో 0.03 శాతంగా ఉన్న యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 4,30,29,044 కేసులు నమోదయ్యాయని, 5,21,358 మరణాలు సంభవించాయని తెలిపింది. దేశంలో 98.76 శాతంగా కరోనా రికవరీ రేటుగా ఉందని, కరోనా నుంచి 24 గంటల్లో 1316 కోలుకున్నారని పేర్కొంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,95,089 చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









