విరాట్ కోహ్లీ తర్వలో భాగ్యనగరానికి...

- April 03, 2016 , by Maagulf
విరాట్ కోహ్లీ తర్వలో భాగ్యనగరానికి...

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తర్వలో భాగ్యనగరానికి రానున్నారు. గ్రౌండ్‌లో బంతితో చెడుగుడు ఆడుకునే కోహ్లీ... ఫ్యాషన్ ప్రపంచంలో యూత్‌కు ఓ ఐకాన్‌గా నిలిచారు. తన హెయిర్ స్టయిల్‌తో కుర్రకారుకి ఫంక్ లుక్‌ను పరిచయం చేసిన ఈ క్రేజీ క్రికెటర్... ఇప్పడు స్వయంగా ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టారు. యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్ ప్రయివేట్ లిమిటెడ్‌లో సచిన్‌తోపాటు కోహ్లీ కూడా భాగస్వామిగా మారారు. కూకట్‌పల్లిలోని సుజనామాల్‌లో 'రాంగ్' పేరుతో ఓ షోరూంను ఏర్పాటు చేశారు. నగర యువత ఆకాంక్షలకు తగ్గ ఫ్యాన్లను అందించి, వారి ఆదరణ పొందుతామని నిర్వాహకులు చెప్పారు. త్వరలోనే ఇక్కడికి విరాట్ కోహ్లీ వస్తారని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com