638 మంది డ్రగ్స్ అనుమానితులు అరెస్ట్
- April 09, 2022
కువైట్: 2022 మొదటి త్రైమాసికంలో 638 మంది డ్రగ్స్ అనుమానితులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. స్మగ్లర్లు, డ్రగ్స్ పంపేవారిని ఎదుర్కోవడానికి ఇతర భద్రతా రంగాల సహకారంతో తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొంది. ప్రత్యేక భద్రతా సంస్థల సమన్వయంతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. డ్రగ్స్ ప్రమోటర్లు యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, డ్రగ్ పెడ్లర్లపై నిఘా పెట్టినట్టు పేర్కొంది. మాదకద్రవ్యాల సమస్యను ఎదుర్కొనేందుకు పౌరులు, నివాసితులు భద్రతా సేవలతో సహకరించాలని భద్రతా వర్గాలు పిలుపునిచ్చాయి. అన్ని కుటుంబాలు తమ పిల్లలపై పర్యవేక్షణ పెట్టాలని సూచించింది. పిల్లలో మతపరమైన నైతిక విలువలను పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









