ఏపీ ప్రజలకు మరో షాక్..
- April 10, 2022
అమరావతి: ఏపీ లో ధరల పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.పేద, మధ్య తరగతి ప్రజలు పెరుగుతున్న ధరలతో అల్లాడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్.. ఇలా ఏ వస్తువు ధర చూసిన ఆకాశాన్ని అంటోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రభుత్వాలు ప్రజలపై మరింత భారం మోపుతున్నాయి. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ క్రమంలో… ప్రజలపై మరో పిడుగు వేసింది. ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచింది. పట్టణాల్లో భారీగా ఆస్తిపన్ను పెరిగింది. దాదాపు ప్రజలపై రూ. 214 కోట్ల భారం పడింది. పట్టణాల్లో మరో 15 శాతం పెంచగా, రెండు సంవత్సరాల్లో 32.24 శాతం పెరిగినట్లైంది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేయడం.. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేయడం.. ఇలా పలు రకాల పన్నుల విషయంలో.. అధికారులు ప్రజలపై తీసుకునే చర్యలు ఏపీలో సర్వసాధారణంగా మారిపోయాయి. కానీ, చెత్త పన్ను, ఆస్తి పన్ను పేరుతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా.. పన్నులు వసూలు చేయాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. పన్నులు కట్టకపోతే ఇంట్లోని వస్తువులు జప్తు చేస్తామనే హెచ్చరికలు జారీ చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. పన్నుల వసూలు కోసం తూర్పు గోదావరి జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ప్రస్తుతం పెరిగిన ఆస్తి పన్నుపై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









