ఏపీలో ‘మీ సేవ’ ఛార్జీలు పెంపు
- April 11, 2022
అమరావతి : ఏపీలో మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సేవలకు వసూలు చేసే సర్వీసు ఛార్జీలను ప్రభుత్వం నేటి నుంచి పెంచింది. కేటగిరి – ఎ, కేటగిరి – బి కింద అందించే సేవలకు వసూలు చేసే ఛార్జీలను రూ.5 మేర పెంచింది. దీని ద్వారా ఏడాదికి సుమారు రూ.60 కోట్ల భారం సామాన్య ప్రజలపై పడనుంది. ఇప్పటికే వివిధ ఛార్జీలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో… ఈ పెంపుతో వారిపై అదనుపు బాదుడు మోపుతుంది.
మీ సేవ ద్వారా వివిధ విభాగాలకు చెందిన సుమారు 512 రకాల సేవలు అందుతాయి. దీనికి సర్వీసు ఛార్జీ కింద ఎ కేటగిరి కింద 35, బి కేటగిరి కింద 45 రూపాయల వంతున ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇందులో నిర్వాహకులకు చెల్లించే మొత్తం పోనూ… మిగిలిన మొత్తం ప్రభుత్వం ఖాతాలో జమ అవుతుంది. ఇవాళ్టి నుంచి సర్వీసు ఛార్జీలను మార్పు చేస్తున్నట్లు నిర్వాహకులకు సంబంధింత శాఖ ఆదివారం సాయంత్రమే సమాచారం పంపింది.
తాజా వార్తలు
- ఇండియా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
- బ్యాంకుల్లో బయోమెట్రిక్ వేరిఫికేషన్..వినియోగం పై ఆందోళనలు?
- ఇరాన్ కు వ్యతిరేకంగా..ఐసీఏఓ వద్ద కువైట్ సెకండ్ ప్రొటెస్ట్..!!
- బార్కాలో ఒక వాణిజ్య సంస్థ మూసివేత..!!
- ఫేక్ బహ్రెయిన్ దినార్లు..ఐదేళ్ల జైలుశిక్ష, BD500 ఫైన్..!!
- ఆయిల్ ఔట్ పుల్ ని పెంచనున్న 7 ఒపెక్+ దేశాలు..!!
- ఎయిర్ స్పేస్ క్లోజ్,ఫ్లైట్స్ సస్పెన్షన్..ఖండించిన QCAA..!!
- యూఏఈలో ‘ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డు’ ప్రకటన..
- ఆగస్టు నుంచి రైల్వే టికెట్ బుకింగ్లో సరికొత్త మార్పు
- తిరుమల శ్రీవాణి టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు..









